జులాయి.సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల అనంతరం అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం తండ్రి,కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతుందని అందుకే ఈ సినిమాకు నాన్న నేను అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. తరువాత అలకనంద అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న టాక్ వచ్చింది.తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదక వచ్చింది. ఈ సినిమాకు‘ అల వైకుంఠ పురంబులో’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ వినగానే మనస్సు లో ఓ రకమైన పవిత్రమైన భావిన కలుగుతుందని, సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు. సినిమాకు ఇదే ప్లస్ పాయింట్ కానుంది. టైటిల్ను స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే మరి కొద్ది గంటల్లో టైటిల్ విషయంలో క్లారిటీ రానుంది.కాగా తన చిత్రాలకు సాధారణ టైటిల్స్ కాకుండా కొంత వెరైటీగా టైటిల్స్ పెట్టే త్రివిక్రమ్ ఈసారి ఏ టైటిల్ ఫిక్స్ అయ్యాడోనని ఆతృతగా ఎదురు చూసిన అభిమానులు కొత్త టైటిల్ చూసి దాని అర్థం వెతికే పనిలో పడ్డారట..