అమరావతి: జాతీయోద్యమ కాలం-1923లో ఆరంభమైన ఆంధ్రా బ్యాంకు కాలగర్భంలో కలసి పోయింది. బుధవారం యూనియన్ బ్యారక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది.దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకులను కేంద్రం విలీనం చేసింది. తెలుగువారి మదిలో స్థానం సంపాదిరచుకున్న ఆంధ్రాబ్యాంకును 1923 నవంబర్ 20న ప్రముఖ స్వాతరత్య్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో స్థాపించారు. చిన్న బ్యాంకుగా ప్రారంభమైన ఆంధ్రాబ్యాంకును 1980లో జాతీయం చేశారు. దేశంలోనే క్రెడిట్ కార్డును జనానికి పరిచయం చేసిన తొలి బ్యాంకుగా ఆంధ్రా బ్యాంకు గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ బ్యారకులో 20 వేల మంది వరకు పని చేస్తున్నారు. ఆంధ్రాబ్యాంకు పేరు ఇకపై లేకుండాపోవడం బాధాకరం.