విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్రావును శుక్రవారం పోలీసులు ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. కాగా శ్రీనివాస్ ఓ అభ్యర్థనను న్యాయమూర్తి ముందు ఉంచారు. తనకు పుస్తకం రాసే అవకాశం ఇవ్వాలని కోరారు. తన భావాలను ప్రజలకు చెప్పుకునే అవకాశం కల్పించాలని విన్నవించుకున్నాడు. రాజకీయంగా ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారని, తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించాలని న్యాయమూర్తతో నిందితుడు శ్రీనివాస్రావు అన్నారు.