కియా కారును విడుదల చేసిన చంద్రబాబు

  • In Money
  • January 29, 2019
  • 733 Views

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ నుంచి తొలి కారు ఈ ఉదయం విడుదలైంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తొలి కారును స్వయంగా విడుదల చేశారు. ఈ ఉదయం విజయవాడ నుంచి పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో చేరుకున్న చంద్రబాబు, అక్కడి నుంచి హెలికాప్టర్ లో కియా పరిశ్రమలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వరకూ వెళ్లారు. సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో రూ. 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కియా సంస్థ ఏర్పాటైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే తాము రెండున్నరేళ్ల వ్యవధిలో ప్లాంటు, అసెంబ్లీ లైన్ ను నిర్మించి తొలి కారును తయారు చేయగలిగామని సంస్థ చీఫ్ పార్క్ వ్యాఖ్యానించారు. మేడిన్ ఆంధ్రా కారుగా ఈ కారు నిలుస్తుందని తెలిపారు. చంద్రబాబు . ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2017లో నిర్మాణాన్ని ప్రారంభించిన కియా… అప్పుడే ప్రొడక్షన్ స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. దక్షిణ కొరియాకు, ఏపీకి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. కొరియా, ఏపీ ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుకురాగలుగుతారని తెలిపారు.అనంతపురం ప్రాంతం ఆటోమొబైల్ హబ్ గా మారుతుందనే ఆకాంక్షను చంద్రబాబు వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా రాయబారి ఏపీకి బ్రాండ్ అంబాసడర్ గా మారారని కితాబిచ్చారు. పరిశ్రమలను ఆకట్టుకునేందుకు తాము ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. కియా మోటార్స్ కు భారత్ అతి పెద్ద మార్కెట్ అవుతుందని తెలిపారు. ఏపీని సొంత ప్రాంతంగా భావించాలని కొరియా అధికారులు, సిబ్బందికి సూచించారు. ఏపీలో అపోలో టైర్స్, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, భారత్ ఫోర్డ్ లాంటి భారీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos