హైదరాబాద్: లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ అధికారులు ఇద్దరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నగరంలోని మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నగేశ్, శ్రీనివాస్ లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఓ న్యాయవాది నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడ్డారు.