ఏడాదిగా తాగు నీటికి కట కట

ఏడాదిగా తాగు నీటికి కట కట

హొసూరు : తళి సమితిలోని సారకపల్లి పంచాయతీ హొసట్టి గ్రామంలో ఏడాదిగా తాగు నీటి సమస్యతో అల్లాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ మహిళలు ఆరోపించారు. రోజూ రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోయారు. సంబంధిత అధికారులకు దీనిపై ఎన్నో సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటాయని, బోరు బావుల నుంచి చుక్క నీరు రావడం లేదని తెలిపారు. విధి లేక వ్యవసాయ బోరు బావి నుంచి నీరు తెచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికైనా  అధికారులు స్పందించి, తక్షణమే నీటి సౌకర్యం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos