ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 25.41 శాతం పోలింగ్‌

ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 25.41 శాతం పోలింగ్‌

న్యూ ఢిల్లీ : దేశంలో లోక్సభ మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ మూడో దశలో 11 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా ఉదయం 11 గంటల వరకు 25.41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 32.82 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా మహారాష్ట్రలో 18.18 శాతం నమోదైనట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్, ఇతర నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos