అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా పథకంతో మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నోట మాట పెగలటం లేదని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సోమవారం ట్వీట్లో ఎద్దేవా చేసారు. 50 లక్షల రైతు కుటుంబాలకు, కౌలు రైతులకు రూ. 12,500 చొప్పన సాయం అందు తుం దని తెలిపారు. ‘పోలీసులకు వారాంతపు సెలవు, హోం గార్డుల వేతనం పెంపును అధికారులే ప్రకటించారు. చంద్రబాబు హయాంలో న్యూస్ చానళ్లు ప్రైమ్ టైంలో సంఘాల నాయకులను ముందే పిలిపించి ముఖ్యమంత్రి వీరుడు, శూరుడు అని పొగిడించే కార్యక్రమాలు ఉండేవి. ‘బహిరంగ విపణిలో తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నా బాబు సర్కారు అధిక ధరలకు విద్యుత్ కొని డిస్కమ్లను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది.‘యూ-ట ర్న్ అనే ప దం 1930 ప్రాంతంలో వాడుకలోకి వచ్చిందని ప్రఖ్యాత మెర్రియం వెబ్స్టర్ ఇంగ్లిష్ డిక్షనరీ చెబుతోంది. ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు దాన్ని ఆచర ణలో పెట్టిన రికార్డు చంద్రబాబు గారిదే. అవకాశవాదం, కాళ్లు పట్టు కోవడం తప్ప ఒక సిద్ధాంతం లేని నాయకుడు ఇతనొక్కడే’అని వరు స ట్వీట్లతో విమర్శల వర్షాన్ని కురిపించారు.