అమెరికాలో హైదరాబాద్ యువకుని మృతి

  • In Crime
  • May 14, 2019
  • 146 Views
అమెరికాలో హైదరాబాద్ యువకుని మృతి

హైదరాబాద్‌కు చెందిన సాహిత్‌ రెడ్డి అమెరికాలోని నార్త్‌ కరోలినాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎంఎస్‌ చేయడానికి వెళ్లిన సాహిత్‌ కారు ఢీ కొన్న సంఘటనలో మృతి చెందాడు. నల్లకుంటలోని పద్మా కాలనీలో అతని తల్లిదండ్రులు మధుసూదన్‌ రెడ్డి, లక్ష్మి నివసిస్తున్నారు. తమ కుమారుని మరణ వార్త తెలియడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాహిత్‌ వారికి పెద్ద కుమారుడు. మృత దేహాన్ని స్వదేశానికి తరలించడానికి ప్రభుత్వం సహకరించాలని వారు కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos