అల వైకుంఠపురములో సినిమాపై తెదేపా ఎంపీ వ్యాఖ్యలు..

అల వైకుంఠపురములో సినిమాపై తెదేపా ఎంపీ వ్యాఖ్యలు..

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన అల్లు అర్జున్‌ నటించిన కొత్త చిత్రం అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు బ్లాక్‌బస్టర్‌ దిశగా దూసుకుపోతోంది.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.104 కోట్ల షేర్‌ రాబట్టిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఇక సినిమాలో శ్రీకాకుళం యాసలో సిత్తరాల సిరపడు అనే జానపద గీతం కూడా ఉంది. పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. దీనిపై ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ యువ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు స్పందించారు.శ్రీకాకుళం జిల్లా సంస్కృతి, సాహిత్యం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ సిత్తరాల సిరపడు పాట ద్వారా వివరించారంటూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, లిరిక్ రైటర్ విజయ్ కుమార్ భల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా స్టయిలిష్ ఫైట్ కోసం నేపథ్యంగా తమ ప్రాంతపు పాటను వాడుకున్నందుకు అల్లు అర్జున్ కు కూడా రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. పాట పాడిన సూరన్న, కొమాండూరి సాకేత్ లకు కూడా యువ ఎంపీ కృతజ్ఞతలు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos