మాధవన్-విజయ్ సేతుపతి కాంబినేషన్లో 2017లో విడుదలైన విక్రమ్ వేదా చిత్రం తమిళంలో అద్భుత విజయం సాధించింది.మాధవన్-విజయ్ సేతుపతి ఒకరితో ఒకరు పోటీ పడి నటించిన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది.అప్పట్లో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు కూడా జరిగాయని వెంకటేశ్-రానా కాంబినేషన్లో తెరకెక్కుతుందని వార్తలు వినిపించినా అవేవి నిజం కాలేదు.మరోసారి ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రీమేక్ చేయాలనుకున్నారు. ప్రధాన పాత్రలకి గాను రానా – రవితేజ పేర్లు వినిపించాయి.అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మళ్లీ ఇప్పుడు అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టు గురించిన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంలో మాధవన్ చేసిన పాత్రను చరణ్ తో చేయిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరో పాత్రను రవితేజతో చేయిస్తారా? రానాను తీసుకుంటారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. 2022లో ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళుతుందని చెప్పుకుంటున్నారు.