ఆగ్రా: అతిథులకు 150 అడుగుల ఎత్తులో భోజనాలు పెట్టేల హోటల్ ఇక్కడ ఆరంభం కానుంది.24 మంది కూర్చొని భోజనాలు చేసేలా కు ర్చీ లు, మేజాల్ని ఏర్పాటు చేసిన భారీ బల్లను హైడ్రాలిక్ క్రేన్ సాయంతో పై కెత్తుతారు.తాళ్ల సాయంతో అది ఆకాశంలో సంచరిస్తుందని హోట ల్ సంచాలకుడు మనోజ్ అగర్వాల్ శనివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. పర్యాటకుల్ని ఇది ఎంతగానో ఆకర్షిస్తుందని ఆశించారు.ఆత్మీ యు లతో కలిసి నింగిలో విహరిస్తూ రుచికరమైన విందు ఆరగిస్తూ తాజ్మహల్ను వీక్షించే అవకాశం లభిస్తుంది.