సీమలోనే రాజధాని ఉండాలి

సీమలోనే రాజధాని ఉండాలి

కడప: శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని, ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ భారీ సంఖ్యలో విద్యార్థులు నగరంలో ప్రదర్శన జరిపారు. రాయలసీమ విద్యార్థి యువజన ఐకాస ఆధ్వర్యంలో ప్రదర్శన పాత బస్టాండు నుంచి కోటి రెడ్డి కూడలి వరకు సాగింది. తక్షణమే మంత్రి వర్గం సమావేశమై రాయలసీమలో రాజధాని, ఉన్నత న్యాయస్థానం ఏర్పాటుకు తీర్మానించాలని డిమాండ్ చేశారు. మాజీ గత ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేసారని ఆరోపించారు. ఇప్పటికైనా పశ్చాత్తాపం చెంది రాయల సీమ ఉద్యమానికి మద్దతు పలకాలని ఆయన్ను కోరారు. వివిధ రాజకీయ పక్షాలు తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని ఐకాస నాయ కుడు భాస్కర్ విన్న విం చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పంచించక పోతే విద్యాసంస్థల బంద్ చేపడతామని తెలిపారు. వచ్చేనెల 15 తర్వాత రాయలసీమ బంద్ చేపట్టి ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos