ఎర్ర దీపం వెలిగితే బండి ఇంజను నిలిపేయండి

ఎర్ర దీపం వెలిగితే  బండి ఇంజను  నిలిపేయండి

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం గురువారం ఎర్ర దీపం వెలిగిన వెంటనే బండిని నిలిపేయండి ప్రచారాన్ని ప్రారంభించింది. రహదారుల్లోని సిగ్నల్ దీపాల వద్ద ఉన్న పౌర రక్షణణ కార్యకర్తలు ఎర్ర దీపాలు వెలిగినపుడు వాహనాలను ఆపి వేయాలని వాహనదారులకు చెప్పటమే దీని ఆశయం. ఇందుకోసం కార్యకర్తలు వాహనదారులకు గులాబీలు ఇచ్చి మరీ కూడళ్లలో ఎర్ర దీపం వెలగినపుడు వాహనాలను వెంటనే ఆపివేసి కాలుష్యాన్ని తగ్గించేందుకు సహకరించాలని కోరుతున్నారు. ఎర్ర దీపం వెలిగిన వెంటనే ఇంజిన్ నిలిపి వేస్తే కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలవుతాయని చెప్పారు. ఈ ప్రచారాన్ని నవంబరు 15 వరకూ నగరంలోని 100 కూడళ్లల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8గంటల వరకూ చేస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos