ఫలితాలకు ముందే పరాజయాన్ని అంగీకరించిన కమలం

ఫలితాలకు ముందే పరాజయాన్ని అంగీకరించిన కమలం

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే భాజపా ఓటమిని అంగీకరించిందా? ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమైన ఓ పోస్టర్ను చూస్తే నిజమేనని అనిపించకమానదు. ‘విజయంతో మనం అహంకారులుగా మారకూడదు. పరాజయంతో మనం నిరాశకు గురికాకూడదు’ అని రాసి ఉన్న ఆ పోస్టర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫొటో ఉంది. ఆ పోస్టర్లో ఉన్నదానిని బట్టి కమలనాథులు తమ ఓటమిని ముందే ఊహించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సోమవారం కూడా విజయం తమదేనని బీరాలు పలికిన వారు ఇప్పుడు ఫలితాల తీరును చూసి నీరుగారిపోయారు. కార్యకర్తలు నిరాశ పడరాదని పత్రాన్ని అతికించినట్టు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ గెలుపు ఖాయమైపోయింది. ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్న స్థానాలు ఇప్పటికే మెజారిటీ సంఖ్యను దాటిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos