గర్భిణీపై సామూహిక అత్యాచారం..

భర్తతో కలసి సినిమా చూసి వస్తున్న గర్భిణీపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డ ఘటన తమిళనాడు రాష్ట్ర కడలూరులో చోటు చేసుకుంది. కడలూరు సమీపంలోని పుదుప్పాళ్యం ప్రాంతానికి చెందిన ఐదు నెలల గర్భిణి స్థానికంగా ఉన్న థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లింది. దీన్ని గమనిం చిన నలుగురు ఆమెపట్ల తొలుత అసభ్యంగా వ్యవహరించారు. అనంతరం లైంగికంగా వేధించడంతో ఆమె ఎదురు తిరిగింది. దీంతో తోకముడిచిన యువకులు ఆమెను వదిలేశారు. ఆమె సినిమా థియేటర్లోకి వెళ్లిపోయింది.సినిమా పూర్తయి బయటకు వచ్చిన అనంతరం దంపతుల బైకును వెంబడించిన నిందితులు నిర్జనప్రదేశంలో వారిని అడ్డుకున్నారు. తరువాత భర్త మీద ముగ్గురు ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. భర్తను కట్టేసి చితకబాదిన నిందితులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకొని కమ్మియమ్ పేట్ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు.గర్భిణి అని కనికరం లేని కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలు సైతం తీశారు.విషయం బయటకు చెబితే అత్యాచార వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని, మిమ్మల్ని, మీ పిల్లలను చంపేస్తామని బెదిరించారు.మహిళపై సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు తరువాత ఆమెను కారులో తీసుకెళ్లి ఇంటి సమీపంలో వదిలి పారిపోయారు.కట్లు విడిపించుకున్న అనంతరం భార్య ఇంటి దగ్గరకు చేరుకుందని తెలుసుకున్న భర్త అక్కడికి పుదునగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos