హోసూరులో వర్షం కోసం దుగ్గిలమ్మకు పూజలు

హోసూరులో వర్షం కోసం దుగ్గిలమ్మకు పూజలు

హోసూరు : హోసూరు ప్రాంతంలో వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఇక్కడి రామనాయక చెరువులో గల దుగ్గిలమ్మకు విశేష పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో వర్షాల కోసం ఏటా పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా హోసూరు మాజీ ఎమ్మెల్యే కె.ఎ. మనోహరన్ నేతృత్వంలో దుగ్గిలమ్మ దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోసూరు ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ దుగ్గిలమ్మ దేవాలయంలో పూజలు చేయడం హోసూరు ప్రజల ఆచారమని, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని మనోహరన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కృష్ణమూర్తి, నారాయణప్ప, చిన్నప్ప,మురుగన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos