మోదీ మాత్రమే అలా చేయగలదు

మోదీ మాత్రమే అలా చేయగలదు

న్యూఢిల్లీ : మంత్రివర్గం అనుమతి లేకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కేవలం భాజపా హయాంలోనే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం విమర్శించారు. . మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించడంపై ఎద్దేవా చేస్తూ శనివారం ట్వీట్ చేశారు. ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ సమావేశం నిర్వహించకుండా ఈ ప్రకటన చేసినట్లు మీరు గమనించారా? ముందుగా కేబినెట్ అనుమతి తీసుకోకుండా చట్టాలు చేయడం, ఉపసంహ రించడం కేవలం బీజేపీ హయాంలో మాత్రమే జరుగుతుంది’’ అని మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన ట్వీట్లపై కూడా చిదంబరం ఘాటుగా స్పందించారు. ‘మోదీ పెద్ద మనిషి తరహాలో వ్యవహరించారని అమిత్ షా, రైతుల పట్ల మోదీకి చాలా శ్రద్ధ ఉందని జేపీ నడ్డా , రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత 15 నెలల్లో ఈ నేతలంతా ఏమైపోయారు. తెలివైన సలహాలు ఎందుకు ఇవ్వలేకపోయార’ని ప్రశ్నించారు. కేబినెట్ అనుమతికి ముందే చట్టాలు చేయడం, ఉపసంహరించడం కేవలం బీజే పీ హయాంలో మాత్రమే జరుగుతుందని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos