అత్తిపల్లి వద్ద హైడ్రామా

అత్తిపల్లి వద్ద హైడ్రామా

హోసూరు : కరోనా ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో హై డ్రామా చోటుచేసుకొంది. తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి హోసూరుకు బస్సులలో వచ్చి బెంగళూరుకు కాలినడకన వెళ్లదలుచుకున్న వారిని అత్తిపల్లి సరిహద్దులో కర్ణాటక పోలీసులు వెనక్కు పంపిస్తున్నారు.తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వల్ల చెన్నై సహా  నాలుగు జిల్లాలలో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. దీనిపై అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు నుంచి వచ్చే వారిపై కఠిన ఆంక్షలు విధించింది. తమిళనాడు నుంచి కర్ణాటకకు వచ్చేవారిని తప్పనిసరిగా 11 రోజులు క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించినా ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. గత 16 వ తేదీ నుంచి శుక్రవారం వరకు అయిదు వందల మందికి  పైగా క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు కాలినడకన కర్ణాటకలోకి ప్రవేశిస్తున్న వారిని కర్ణాటక పోలీసులు అటు నుంచి అటే తమిళనాడు సరిహద్దుకు తరిమివేస్తున్నారు. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక సరిహద్దులోని ఎలాగైనా ప్రవేశించాలనే వారిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నారు. కర్ణాటక సరిహద్దులో జరుగుతున్న ఈ పరిణామాలు తెలియని అనేక మంది అవస్థలు పడుతున్నారు. తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి బెంగళూరుకు రావాలనుకుంటున్న వారిని అత్తిపల్లి వద్ద కర్ణాటక పోలీసులు అడ్డుకుంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos