దర్శకుడు తేజ తాజాగా హీరో గోపిచంద్తో అలమేలు మంగ వెంకట రమణ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం తొలుత కాజల్ అగర్వాల్ను సంప్రదించడం ఆమె ఓకే చెప్పడం జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే కొద్ది రోజులుగా ఆమె ఆ సినిమా నుంచి తప్పుకొన్నారనే వార్త వైరల్ అయింది.అయితే అలమేలు మంగ వెంకట రమణ నుంచి తప్పుకోవడానికి కారణం రెమ్యునరేషన్ అంశమే అనే వాదన బయటకు వచ్చింది. యూనిట్ ఆఫర్ చేసిన దానికంటే ఎక్కువ డిమాండ్ చేసింది. వారు అందుకు ఒప్పుకోకపోవడంతో కాజల్ సినిమాను చేయనని చెప్పి బయటకు వెళ్లింది. తేజ నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు అనే వార్తలు మీడియాలో షికారు చేశాయి.తాజా సమాచారం ప్రకారం.. అలమేలు మంగ వెంకట రమణ చిత్రంలో కాజల్ను తప్పించి ప్రస్తుతం మహానటితో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న కీర్తి సురేష్ను సంప్రదించారని, ఈ సినిమా స్క్రిప్టుపై ఆమెకు నచ్చడంతో నటించడానికి ముందుకు వచ్చారు. దాంతా ఆమెను ఎంపిక చేశారు అనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.కీర్తి సురేష్ లాక్డౌన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తన రెమ్యునరేషన్ తగ్గించుకొంటున్నట్టు వార్తలు వచ్చాయి. రాబోయే చిత్రాలకు తన రెమ్యునరేషన్ను 30 శాతం మేరకు తగ్గించుకొంటున్నానని బహిరంగ ప్రకటన చేయడం కూడా తేజ సినిమాకు కలిసి వచ్చింది. రెమ్యునరేషన్తోపాటు టాలెంటెడ్ నటిని ఎంపిక చేశామనే సంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వార్త అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.