బైరమంగలం పంచాయితీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తున్న ప్రతిమ గోపాల రెడ్డి
హొసూరు : కృష్ణగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు జోరుగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. కెలమంగలం యూనియన్లోని 28 పంచాయతీలకు గురువారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జిల్లాలో ఈ నెల 28, 30 తేదీలలో రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. బైరమంగలం పంచాయతీ అధ్యక్ష పదవికి ప్రతిమ గోపాల రెడ్డి, దొడ్డమెట్రి పంచాయతీ అధ్యక్ష పదవికి యశోద నామినేషన్లు దాఖలు చేశారు. ఉడేదుర్గం, బేవనతం పంచాయతీలలో అధ్యక్ష, కౌన్సిలర్ పదవులకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో కెలమంగలం యూనియన్ కార్యాలయం…అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిక్కిరిసిపోయింది.
దొడ్డమెట్రి పంచాయతీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్న యశోద