హొసూరు : స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. హొసూరు యూనియన్ పంచాయతీ అధ్యక్ష, కౌన్సిలర్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. హొసూరు యూనియన్ లోని కెలవరపల్లి పంచాయతీ అధ్యక్ష పదవికి రాజా రెడ్డి, అచ్చటిపల్లి పంచాయతీ అధ్యక్ష పదవికి కే. గోపాల్ రెడ్డి, అలసపల్లి పంచాయతీ అధ్యక్ష పదవికి రాజేంద్రన్ నామినేషన్లు దాఖలు చేశారు.
హొసూరు యూనియన్ తోటగిరి గామానికి చెందిన త్యాగరాజ రెడ్డి నామినేషన్ వేశారు. వార్డు సభ్యుల పదవులకు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.