ముగిసిన నామినేషన్ల ఘట్టం

ముగిసిన నామినేషన్ల ఘట్టం

హొసూరు : క్రిష్ణగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయగోరే అభ్యర్థులు సోమవారం  భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో ఈనెల 27, 30 తేదీల్లో రెండు విడతల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. కౌన్సిలర్ల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. హొసూరు యూనియన్‌లోని సేవగానపల్లి పంచాయతీ యూనియన్ కౌన్సిలర్ స్థానానికి శ్రీమతి సంధ్య గోపి ఏడీఎంకే పార్టీ తరఫున కౌన్సిల్ స్థానానికినామినేషన్‌ వేయగా, అలసపల్లి పంచాయతీ కౌన్సిలర్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అశ్వత్ రెడ్డి,  బేగేపల్లి పంచాయతీ కౌన్సిలర్ స్థానానికి మునిరాజు సీపీఐ తరఫున నామినేషన్లు  దాఖలు చేశారు. రాధా గజేంద్ర తదితరులు హొసూరు యూనియన్ కౌన్సిల్ స్థానాలకు నామినేషన్లు వేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos