న్యూఢిల్లీ : వ్యవసాయ నూతన చట్టాల్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, ఏఎస్ బొపన్న, వీ రామసుబ్రమణియన్లతో కూడిన అత్యతున్నత న్యాయస్థానం ధర్మాసనం సోమవారం కేంద్ర ప్రభుత్వానికి తాఖీదులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చత్తీస్గఢ్కు చెందిన కిసాన్ కాంగ్రెస్ పార్టీ నేత రాకేష్ వైష్ణవ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ అంశంపైనే నాలుగు వ్యాజ్యాల్ని దాఖలయ్యాయి. విపక్షాల వ్యతిరేకత మధ్య గతనెల పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో విపక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి.