ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశాడనే కారణంగా తెదేపా శ్రేణులు హీరో ప్రభాస్తో పాటు ప్రభాస్ నటించిన కొత్త చిత్రం సాహోపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ప్రభాస్పై,సాహో చిత్రంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఊహించుకొని కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా కేవలం ఓ మీడియా కావాలని చేస్తున్న ప్రచారమని నారా లోకేష్ మండిపడ్డారు.టిడిపి ప్రభాస్ కు వ్యతిరేకంగా, సాహో సినిమా కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ అబద్ధాలు రాసిన జర్నలిస్టు సిగ్గుపడాలని పేర్కొన్నారు నారా లోకేష్.కుల విభజన, విద్వేష వ్యాప్తితో సంపాదించిన సొమ్ముతో తిండి ఎలా తింటున్నారు? అంటూ లోకేష్ నిప్పులు చెరిగారు. మీకు మనస్సాక్షి అనేదే లేదా? అంటూ నిలదీశారు.దీంతోపాటు “అయినా సాహో ఓ భారీ బడ్జెట్ చిత్రం. ఈ అద్భుతమైన సినిమాను చూడ్డానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ లాగా నేను కూడా ఉవ్విళ్లూరుతున్నాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంటూ ప్రభాస్ పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత స్పష్టం చేశారు. సాహో చిత్రాన్ని ప్రభాస్ ఫ్యాన్సే కాదు, టీడీపీ మద్దతుదారులు కూడా వీక్షించి ఆ పనికిమాలిన కథనాన్ని విసిరికొట్టండి” అంటూ ట్వీట్ చేశారు..