దృష్టి లోపంతో బాధ పడే వ్యక్తులు భారత కరెన్సీ నోట్లను గుర్తించడానికి వీలుగా భారత రిజర్వ్బ్యాంకు ప్రత్యే మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చింది.ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చేతులమీదుగా ‘ఎంఏఎన్ఐ’(మనీ) పేరుతో మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించారు.కంటిచూపు సరిగాలేని వారు సులువుగా నోట్లను గుర్తించేలా ఈ యాప్ ను తయారు చేశామన్నారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్లు ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. దీనిని ఒకసారి ఇన్ స్టాల్ చేసుకుంటే, ఆ తర్వాత అది ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఫోన్ లోని కెమెరాను ఉపయోగించుకుంటూ ఈ యాప్ కరెన్సీ నోట్లను స్కాన్ చేసి హిందీ లేదా ఆంగ్లంలో సమాధానమిస్తుందన్నారు..