తమిళ చిత్ర పరిశ్రమలో పరిస్థితులపై ఓ వర్ధమాన నటి చేసిన వ్యాఖ్యలు అక్కడి పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.తమిళ చిత్ర పరిశ్రమలో నెపోటిజం ఎక్కువగా ఉందని సినీ ప్రముఖుల వారసులకు తప్ప మరెవరికీ అవకాశాలు దక్కనీయడం లేదంటూ ఆరోపణలు చేశారు.అగ్ని సిరాగుగల్ అనే చిత్రంలో మొదట నన్ను ఎంపిక చేసుకున్నామని తెలిపిన దర్శకనిర్మాతలు కొద్ది రోజుల అనంతరం చిత్రం నుంచి నన్ను తప్పించి కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ను తీసుకున్నారంటూ ఆరోపించారు.ఇలా చేసినందుకు దర్శకుడు నవీన్కి, అక్షర హాసన్కి, నిర్మాత శివకి సిగ్గుగా అనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. మీరా చేసిన ఆరోపణలపై స్పందించిన దర్శకుడు నవీన్..ఈ సినిమా కోసం మొదట షాలిని పాండేని ఎంపిక చేసుకున్నామని తరువాత కొన్ని కారణాల వలన ఆమె స్థానంలో అక్షర హాసన్ ని తీసుకున్నామని చెప్పారు. అసలు సినిమాలో మీరా మిథున్ ని హీరోయిన్ గా అనుకోలేదని..ఆమె మీడియా ముందుకు వచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తుందని అన్నారు.