భార్య వేధింపులు తాళలేక వ్యక్తి తెరాస కార్యాలయం ప్రగతిభవన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది.తాపీ మేస్త్రీగా పని చేస్తున్న అచ్చయ్య భార్య ఆరు మంది సంతానంతో కలసి ఉంటున్నాడు.అయితే తాపీ పనులతో వస్తున్న ఆదాయం భార్య పిల్లలను పోషించడానికి సరిపోకవడంతో భార్య మరియమ్మ భర్త అచ్చయ్యతో గొడవ పడుతుండేది.దీంతోపాటు అచ్చయ్యకు అక్రమ సంబంధాలు అంటగడుతూ ప్రతిరోజూ అచ్చయ్యను వేధిస్తోంది.రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో మనస్తాపం చెందిన అచ్చయ్య ప్రగతిభవన్ ఎదుట కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.గమనించిన భద్రతా సిబ్బంది అచ్చయ్యను కాపాడి ఆసుపత్రికి తరలించారు.దీనికి తోడు తన భార్య మరియమ్మ నిత్యం తనను తిడుతూ, వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వీటన్నింటిని భరించలేక, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. అనంతరం భార్యభర్తలకు కౌన్సలింగ్ ఇచ్చి పంపించారు..