అభిమానులు చేసిన అతికి మలయాళం సూపర్స్టార్ మమ్ముట్టి సామాజిక మాధ్యమాల్లో క్షమాపణలు చెప్పారు.ఇటీవల ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో తమిళ చిత్ర పరిశ్రమ మినహా అన్ని పరిశ్రమలకు రెండు కంటే ఎక్కువ అవార్డులు దక్కాయి.తమిళ చిత్ర పరిశ్రమకు కేవలం ఒక్క అవార్డు మాత్రమే దక్కింది.బారమ్ అనే ఒకేఒక్క తమిళ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది.దీంతో మమ్ముట్టి అభిమానులు జాతీయ అవార్డుల కమిటీ చైర్మన్ రాహుల్ రవిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలాలతో దూషణకు దిగారు.మమ్ముట్టి నటించిన ‘పెరంబు‘ సినిమా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారని పెరంబు చిత్రానికి అవార్డు ఎందుకు ఇవ్వలేదంటూ అసభ్య పదజాలాలతో దూషించారు. తనను తిడుతూ సందేశాలను పంపడం భరించలేక, అభిమానుల వికృత ప్రవర్తన గురించి మమ్ముట్టికి తెలిసేలా రాహుల్ రావయిల్ ఓ పోస్ట్ పెట్టారు. వారు తనను ఎంత బాధిస్తున్నారో ఆ పోస్టులో వెల్లడించారు. కారణమేంటో తెలియదు కానీ కొంతసేపటికే ఆ మెసేజ్ డిలీట్ చేశారు.మిస్టర్ మమ్ముట్టి.. మీ అభిమానులు పరుష పదజాలంతో నాపై దాడి చేస్తున్నారు.. ‘పెరంబు‘ సినిమా అవార్డు ఇవ్వలేదని దూషిస్తున్నారు.. దానికి వివరణ ఇస్తున్నాను‘ అంటూ కమిటీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశించకూడదని.. ‘పెరంబు‘ సినిమాను ప్రాంతీయ కమిటీనే తిరస్కరించడంతో కేంద్ర కమిటీపరిశీలకు రాదని.. విషయం తెలియక మీ అభిమానులు గొడవ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో మమ్ముట్టికి వెల్లడించారు. వెంటనే స్పందించిన మమ్ముట్టి.. క్షమించమని కోరారు. ఈ విషయాలేవీ తనకు తెలియవని.. జరిగినదానికి నేను క్షమాపణలు చెబుతున్నా అంటూ బదులిచ్చారు.