హోసూరు ప్రాంతంలో ఘనంగా కరుణానిధి జయంతి

హోసూరు ప్రాంతంలో ఘనంగా కరుణానిధి జయంతి

హోసూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కరుణానిధి జయంతిని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకె పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. హోసూరు ప్రాంతంలో కరుణానిధి జయంతిని డిఎంకె పార్టీ నాయకులు ఘనంగా ఆచరించారు. డిఎంకె పార్టీ జిల్లాకా ర్యదర్శి, తళి ఎమ్మెల్యే వై.ప్రకాష్ బెన్నంగురు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివంగత కరుణానిధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హోసూరు ఎమ్మెల్యే ఎస్.ఎ. సత్య
హోసూరు సమత్తువపురంలో డిఎంకె పార్టీ పతాకాన్ని ఎగురవేసి వెయ్యి మంది పేదలకు నిత్యావసర సరుకులను పంచిపెట్టారు. హోసూరు సమీపంలోని ఉద్ధనపల్లి గ్రామంలో కరుణానిధి జయంతిని ఘనంగా జరుపుకున్నారు. సూలగిరి యూనియన్ కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్ పాల్గొని కరుణానిధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు వందల మంది పేదలకు నిత్యావసర వస్తువులను పంచిపెట్టారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో డిఎంకె పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos