ప్రాణ గండం తప్పింది

ప్రాణ గండం తప్పింది

జార్షుగూడ : ఒడిశాలోని జార్షుగూడ రైల్వే స్టేషన్‌లో రాజేష్‌ తల్వార్‌ అనే ప్రయాణికుడు త్రుటిలో ప్రాణా పాయాన్ని తప్పించుకున్నాడు. హౌరా నుంచి సంబల్‌పూర్ వెళ్తున్న సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో అతడు ప్రయాణిస్తున్నాడు. మార్గ మధ్యంలో రైలు ఒడిశాలోని జార్షుగూడ స్టేషన్‌లో ఆగింది. టీ తాగేందుకు రాజేష్ రైలు దిగాడు. టీ తీసుకునేలోపే రైలు కదలడంతో ఎక్కేందుకు ప్రయత్నించాడు.అప్పుడు కాలు జారి రైలు, ప్లాట్ఫారానికి మధ్యలో పడి పోయాడు. ఇతర ప్రయాణికులు రాజేష్‌ను రక్షించే లోగా కిందకు జారి పోయాడు. రైలు కొంత దూరం రాజేష్‌ను లాక్కెళ్లింది. దీన్ని చూసిన కొందరు రైలును ఆపారు. రైల్వే భద్రతా దళం వెంటనే రాజేష్‌ను బయటకు తీసింది. ఈ ఘటనలో రాజేష్‌ స్వల్పంగా గాయ పడ్డాడు. అదే రైలులో తన గమ్య స్థానానికి బయలుదేరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos