హొసూరు : హొసూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి వర్షం కురవడంతో వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. హొసూరు, శూలగిరి, బాగలూరు, బేరికె తదితర ప్రాంతాలలో ఈరోజు ఉదయం మంచు కురిసింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. రెండు గంటలకు వర్షం కురిసింది. రాగి, వరి పంట వర్షంలో తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపిలేని వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.