ఆర్థిక శాఖ కార్యదర్శికి అక్షింతలు

ఆర్థిక శాఖ కార్యదర్శికి అక్షింతలు

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో సాగుతున్న విచారణ నవంబర్ 1కి వాయిదా పడింది. కార్మికుల సమ్మె, బకాయిల చెల్లింపు తదితర అంశాలపై మంగళవారం విచారణ జరిగింది. బకాయిల వివరాలను ఈ నెల 31లోపు నివేదించాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశించింది. నవంబర్ 1న ఆర్టీసీ ఆర్థిక వ్యవహారాల అధికారి హాజరు కావాలనీ ఆదేశించింది. జీహెచ్ఎంసీ రూ.335 కోట్లు చెల్లించిందో లేదో కూడా తెలపాలని సూచించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.4,253కోట్లలో రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వివరాలు పరిశీలించకుండానే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి తమకు నివేదిక సమర్పించారని హైకోర్టు ఆక్షేపించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos