న్యూఢిల్లీ: ఇక్కడి రోహిణీ ప్రాంతంలో గురు వారం సంభవించిన సంఘ విద్రోహక శక్తుల పరస్పర దాడుల్లో ఆంచల్ అలియాస్ పవన్ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అతడు ప్రయాణిస్తున్న స్కార్పియో కారుపై ప్రత్యర్థులు సుమారు 50 సార్లు తుపాకులతో కాల్పులు జరపటంతో పవన్ అక్కడికక్కడే చనిపోయాడన్నారు. హత్యా యత్నం కేసులో చెరసాలలో బంధీ అయిన పవన్ మూడు నెలల కిందట విడుదల య్యాడు. ముఠా తగాదాలే కాల్పులకు కారణమనం భావిస్తున్నారు. దీపక్ టీటర్ గ్యాంగ్ ముఠా కాల్పలకు పాల్పడి ఉంటుందని భావి స్తు న్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.