దిశపై హత్యాచారం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో నిందితుల ఎన్కౌంటర్ ఘటన అంతేస్థాయిలో సంచలనం సృష్టించింది.దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఇప్పటికే మానవ హక్కుల సంఘాలు,మహిళా సంఘాలు కోర్టుల్లో పిటిషన్లు,పోలీస్స్టేషన్లలో కేసులు,విచారణలతో రాద్ధాంతం చేస్తున్నాయి.ఇక జాతీయ మానవ హక్కుల సంఘం మరో అడుగు ముందుకేసి ఎన్కౌంటర్పై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి పోలీసులను,నిందితుల కుటుంబాలు,దిశ తల్లితండ్రులను,పెట్రోల్ బంకు సిబ్బందిని విచారించింది.శంషాబాద్ పోలీసులు దిశపై హత్యాచారం జరిగినప్పటి నుంచి ఎన్కౌంటర్ జరిగే వరకు అసలేం జరిగిందన్న దానిపై ఎన్హెచ్ఆర్సీ బృందానికి పూర్తి వివరాలు అందజేశారు.మరోవైపు, ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని నిన్న విదేశీ మీడియా ప్రతినిధులు సందర్శించారు. అమెరికాలోని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు చెందిన సౌత్ ఏషియా ప్రతినిధి జెఫ్రే గెటిల్మేన్ ఆధ్వర్యంలో ముగ్గురు పాత్రికేయులు ఘటనా స్థలాలను పరిశీలించారు. చటాన్పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన దిశ దహనం, హంతకుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఈ బృందం వీడియోలు, ఫొటోలు తీసుకుంది.