బాలియా: దుబార్ పట్టణంలోని జానేశ్వర్ మిశ్రా వంతెన వద్ద శనివారం వాహన చోదకుల నుంచి బలవంతంగా నగదు వసూలు చేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులను సాక్షాత్తూ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా పట్టుకుని సస్పెండ్ చేసారు. ఆనంద్ స్వరూప్ శుక్లా పోలీసు అదనపు సూపరెంటెండెంట్ సంజయ్ కుమార్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేసినపుడు పోలీసుల అక్రమాలు బహి ర్గత మయ్యాయి. డబ్బు వసూలు చేస్తున్న పోలీసు బృందంలో మరో 11 మంది పోలీసు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారని దర్యా ప్తులో తేలింది. వారిపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు.