ఆస్పత్రి వార్డు నిర్మాణానికి రూ.20 లక్షలు ఇచ్చిన మార్కెట్ సంఘం

ఆస్పత్రి వార్డు నిర్మాణానికి రూ.20 లక్షలు ఇచ్చిన మార్కెట్ సంఘం

హోసూరు : హోసూరు సమీపంలోని బేరికే ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక వార్డు నిర్మాణానికి హోసూరు బత్తలపల్లి మార్కెట్ సంఘ నిర్వాహకులు రూ.20 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేశారు. కృష్ణగిరి జిల్లా సూలగిరి యూనియన్ బేరికెలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేకంగా వార్డు నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా హోసూరు బత్తలపల్లి వద్ద గల కూరగాయల మార్కెట్ సంఘం ద్వారా 20 లక్షల రూపాయల చెక్కును కృష్ణగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూలగిరి యూనియన్ చైర్పర్సన్ లావణ్య హేమనాథ్ నేతృత్వంలో మార్కెట్ సంఘ అధ్యక్షులు నారాయణప్పతదితరులు కలెక్టర్ ప్రభాకరన్ కు అందజేశారు .తరువాత కూరగాయల మార్కెట్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మార్కెట్ సంఘ అధ్యక్షుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రభాకరన్ సానుకూలంగా స్పందించినట్లు నారాయణప్ప తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos