70 లక్షల మంది స్వాగతం పలకడానికి ట్రంప్‌ దేవుడా?

70 లక్షల మంది స్వాగతం పలకడానికి ట్రంప్‌ దేవుడా?

న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ను 70 లక్షల మంది భారతీయులతో స్వాగతం పలకనున్నారని వచ్చిన వార్తలపై నెటిజన్లు మండి పడ్డారు. అహ్మాదాబాద్ జనాభానే 50 నుంచి 55 లక్షల మధ్య ఉంటే 70 లక్షల మంది ఎలాగొస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సభలా స్వాగ తానికి కూడా జనాన్ని సమీకరిస్తారాని ఎద్దేవా చేసారు. అహ్మదా బాద్ విమానాశ్రయం నుంచి నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్ కార్యక్రమం జరిగే మోతేరా క్రీడాంగణం వరకూ రహదారి ప్రదర్శన జరగనుంది. ఈ మార్గంలో దాదాపు 70 లక్షల మంది జనం తనకు స్వాగతం పలి కేందుకు సిద్ధంగా ఉంటారని వాషింగ్టన్ లో ట్రంప్ స్వయంగా ప్రకటించినందుకు నెటిజన్లు విరుచుకుపడ్డారు.అంతమందితో స్వాగతం పలకడానికి ఆయనే మైనా దేవుడా? అని ప్రశ్నించారు కూడా. ఒక దేశ అధ్యక్షుడి పర్యటనపై అంత హడావుడి దేనికని కొందరు వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos