డిజిటల్ న్యూస్ కూ ముకుదాడు

డిజిటల్ న్యూస్ కూ ముకుదాడు

న్యూఢిల్లీ : డిజిటల్ న్యూస్ కూడా నియంత్రణ పరిధిలోకి రానుంది. దీని ప్రకారం.. డిజిటల్ న్యూస్ సైట్లు, డిజిటల్ మీడియా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అతిక్రమణకు పాల్పడితే వెబ్సైటు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. లేకుండా జరిమానా విధిస్తారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పిరియాడి కల్స్ చట్ట సవరణ ప్రక్రియను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టింది. డిజిటల్ న్యూస్ సంస్థలను పర్యవేక్షించే ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 90 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిర్వహించే అన్ని రకాల డిజిటల్ మీడియా న్యూస్ పరిమితులకు లోబడి పని చేయాలి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా అప్పిలేట్ బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ మీడియా న్యూస్పై భారత్లో ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదు. ప్రతిపాదిత చట్టం ఆచరణలోకి వస్తే డిజిటల్ మీడియాని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నియంత్రిస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos