హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కమిషనర్ జనార్దన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. సోమవారం ఉదయం ఆయనను తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టింది. హెచ్ఎండీఏ కమిషనర్గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం జనార్దన్రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటన నుంచి రాగానే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.