ఎక్కడ చూసినా తెదేపా బినామీ భూములే

ఎక్కడ చూసినా తెదేపా బినామీ భూములే

అమరావతి : రాజధాని పేరిట చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం శాసనసభలో ఆరోపించారు. రాజధానిగా అమరావతిని ప్రకటించటానికి చంద్రబాబు నాయుడు అక్రమంగా భూముల కొనుగోలు చేసేందుకు తొలుత గుంటూరు, ఆ తరువాత నూజివీడును రాజధానిగా ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. దరిమిలా తెదేపా నేతలు 4070 ఎకరాల భూములను అక్రమంగా కొన్నారని వివరించారు. ఇన్సైడర్ ట్రేడింగ్తో పాటు రాజ్యాంగ్నాన్నీ ఉల్లంఘించారని విమర్శించారు. ‘కంతేరులో హెరిటేజ్ పేరుతో 15 ఎకరాలు, తుళ్లురులో తెదేపా నేత దినకర్ భూములు కొన్నారు. వేమురి రవికుమార్ కుటుంబ సభ్యులకూ అమరావతి ప్రాంతంలో భూములున్నాయి. జీవీఎస్ ఆంజనేయులు 40 ఎకరాల భూముల్ని సొంతం చేసుకున్నారు. పయ్యవుల కేశవ్, ధుళీపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మో హ న్రావులకూ స్థలాలకుకొదవ లేదు. యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి తాడికొండలో భూములు ఉన్నాయి. నారా లోకేష్కు చెందిన బినామీలు వందల ఎకరాల్లో భూములు దోచుకున్నారు. బుచ్చయ్య చౌదరి, మురళీమోహన్, కూడా బినామీల పేర్లతో భూములు కొన్నారు. లంక భూములు, పోరంబోకు, అసైన్డ్ భూముల్లో ప్లాట్లు తీసుకున్నారు. సుజనా చౌదరి, దమ్మలపాటి శ్రీధర్లు కూడా అక్రమంగా ప్రభుత్వ భూములను కొన్నారు. వీరితో బాటు అనేకమంది తెదేపా నేతలు రూ.40 వేల కోట్ల కుంభకోణం చేశారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos