బ్యాంకు ఉద్యోగిపై ఉగ్రవాదులు కాల్పులు

బ్యాంకు ఉద్యోగిపై ఉగ్రవాదులు కాల్పులు

శ్రీ నగర్ : దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో మోహన్ పోరా వద్ద ఎల్లక్వై దేహతి బ్యాంక్ మేనేజరు విజయ్ కుమార్పై గురువారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. షోపియాన్కు కేవలం 13 కిలోమీటర్ల దూరంలో జరిగింది. షోపి యాన్ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. వరుస సంఘ టన లతో జమ్మూ కశ్మీరులో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos