కేంద్ర మంత్రికి అవమానం

కేంద్ర  మంత్రికి అవమానం

పట్నా: కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే పట్నాలో మంగళవారం చేదు అనుభవాన్ని చవి చూసారు. ఇక్కడి వైద్య కళాశాల ఆస్పత్రిలో డెంగీ రోగులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై ఇద్దరు యువకులు సిరా చల్లి పారి పోయారు. చౌబే తన కారును ఆపి, ఆస్పత్రి లోపలికి వెళ్తున్నపుడు యువకులు సిరా చల్లి మాయమయ్యారు. దీంతో ఆయన ఆస్పత్రిలో రోగుల్ని పరామర్శించకుండానే వెనుదిరిగారు. ‘ఇది ప్రజలపైనా, ప్రజాస్వామ్యం పైన సిరా చల్లడమ’ని మంత్రి ఆ తర్వాత అభివ ర్ణించారు. వరద బాధితుల్ని ఆదుకోనందుకు నిరసనగా యువకులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos