రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర

రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర

లఖ్నవూ : వెనుకబడిన, షెడ్యూల్డు కులాలు, తెగలకు ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. గురువారం రాత్రి ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ బాట పడుతూ, ప్రభుత్వోద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రయత్నిస్తోంది. ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని, దాని ద్వారా లభిస్తున్న హక్కులను కాపాడుకోవడానికి 2022 ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు చరిత్రాత్మక అవకాశం. నిరుద్యోగులు, అణగారిన వర్గాలవారు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. ఈ ఎన్నికల్లో పరాజయం తప్పదనే భయం బీజేపీని వెంటాడుతోంది. ఓటమి ఎదురుకాబోతున్నందువల్ల ఆ పార్టీ మరింత అసహనంతో వ్యవహరిస్తోంది. కుట్రలు పన్నేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాలను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ప్రజలు ఈ తప్పులన్నిటినీ గుర్తిస్తున్నారు. , ప్రతిపక్షాలకు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ చెప్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని కోరినవారిని, టీచర్స్ రిక్రూట్మెంట్లో అక్రమాలపై నిరసన తెలిపిన వారిని కొట్టిన విషయాన్ని దాట వేస్తు న్నారు. 2018 తర్వాత ప్రకటించిన దాదాపు 1,30,000కు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దళితులు, వెనుకబడిన వర్గాలవారు తమ రిజర్వేషన్ హక్కులను కోల్పో యారు.  ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిందో తెలియ జేస్తూ హోర్డింగ్లను ఏర్పాటు చేయాల’ని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos