సంబంధం ఉంటే ఉరేసుకుంటా

సంబంధం ఉంటే ఉరేసుకుంటా

కడప:‘ వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్యతో తనకు ఇసుమంత సంబం ధం ఉన్నట్లు తేలినా బహిరంగంగా ఉరేసుకుంటాన’ని మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ కేసును తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా పరిణామాలు సాగుతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు కడపలో విచారణకు హా జ రు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దానికి హాజరవుతాను. ఈ కేసుతో నాకు ఇసుమంత సంబంధం ఉందని తేలినా బహిరంగంగా ఉరే సు కుంటా. జగన్ కుటుంబం పాత్ర ఉన్నట్లు తేలితే ఏం చేస్తారో చెప్పాలి. సిట్ దర్యాప్తుపై ఎవరికీ నమ్మకం లేదు. విచారణను సీబీఐకి అప్పగించాల’ని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos