కడప:‘ వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్యతో తనకు ఇసుమంత సంబం ధం ఉన్నట్లు తేలినా బహిరంగంగా ఉరేసుకుంటాన’ని మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ కేసును తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా పరిణామాలు సాగుతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు కడపలో విచారణకు హా జ రు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దానికి హాజరవుతాను. ఈ కేసుతో నాకు ఇసుమంత సంబంధం ఉందని తేలినా బహిరంగంగా ఉరే సు కుంటా. జగన్ కుటుంబం పాత్ర ఉన్నట్లు తేలితే ఏం చేస్తారో చెప్పాలి. సిట్ దర్యాప్తుపై ఎవరికీ నమ్మకం లేదు. విచారణను సీబీఐకి అప్పగించాల’ని డిమాండ్ చేశారు.