వైఎస్‌ జగన్‌ అరేబియన్ గుర్రం….

వైఎస్‌ జగన్‌ అరేబియన్ గుర్రం….

ఈ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన పాదయాత్రపై ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రోజూ కీలోమీటర్ నడవాలంటేనే ఆయాసానికి గురవుతామని అటువంటిది ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వైఎస్ జగన్ 18 నెలల పాటు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జగన్ సాహసానికి,నిబద్దతకు నిదర్శనమన్నారు.ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయమని, ప్రయత్నం విరమిస్తే అది మరణం అని తెలిసిన ఏకైక నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 18నెలలు నిరాటంకంగా ఆంధ్రప్రదేశ్ నలుమూలలా పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు.జగన్ పాదయాత్రలో ఎన్నో అవమానాలు జరిగాయని, ఎన్నో ఎదురుదెబ్బలు, అవహేళన తగిలాయని వాటన్నింటిని ఆయన తట్టుకుని నిలబడ్డారంటూ చెప్పుకొచ్చారు. ఎవరు ఏమనుకున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయలేదన్నారు.రెండు కళ్లకు గంతలు కట్టిన అశ్వంలా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారని ప్రశంసించారు. అరేబియన్ హార్స్ లా జగన్ రాష్ట్రవ్యాప్తంగా తిరిగి రాజ్యాధికారం చేపట్టారని చెప్పుకొచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos