మాటవినని ‘మందు’గుమ్మలు

  • In Crime
  • January 21, 2019
  • 817 Views
మాటవినని ‘మందు’గుమ్మలు

ఇద్దరు మగువలు మద్యం తాగి పోలీసులను సతాయించారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36, ఫిలింనగర్‌ ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్‌కు చెందిన యువతి అలేఖ్య తన ఖరీదైన కారులో వెళ్తుండగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 10లోని డైమండ్‌ హౌజ్‌ వద్ద పోలీసులు తనిఖీల కోసం నిలువరించారు. శ్వాస విశ్లేషణ పరీక్షలకు సహకరించకుండా తాగలేదంటూ బుకాయించింది. ఆమెకు అతికష్టం మీద పరీక్షలు చేశారు. బ్రీత్‌ ఎనలైజర్‌లో 121 ఎంఎల్‌గా వచ్చింది. ఆమెపై కేసు నమోదు చేశారు. టోలీచౌకికి చెందిన మరో యువతి ఉషా అగర్వాల్‌ కారులో వెళ్తుండగా  ఫిలింనగర్‌లో పోలీసులు ఆపారు. మద్యం తాగినట్లు తేలడంతో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 55 ద్విచక్రవాహనాలు, 49 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos