ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గుగా లేదా?

ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గుగా లేదా?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి,తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డారు.ఎన్నికల్లో పాలిచ్చే ఆవును కాకుండా దున్నపోతును తెచ్చుకున్నారంటూ ప్రజలపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబుపై ఘాటుగా స్పందించారు.పాడి ఆవువంటి ప్రభుత్వ ఖజానాను దోచుకున్నది మీరేనని ప్రజల నోటికాడ ముద్దను తినడమే కాకుండా మిమ్మల్ని మీరు గోమాతగా అభివర్ణించుకోవడం హాస్యాస్పదమని సెటైర్లు వేశారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్ని అనుమతులు తెచ్చినా కూడా పోలవరం ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తి చేయలేక అసమర్థతను రుజువు చేసుకున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ అన్నట్టు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా భావించారే మినహా ప్రాజెక్ట్‌ పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీరు అందించాలనే ఆలోచన చంద్రబాబుకు కోశానా లేదని విమర్శించారు.మహానేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదున్నరేళ్లు వర్షాలకు కొదవ లేదని చెప్పుకొచ్చారు.మెట్ట చేలు కూడా కళకళలాడాయని తెలిపారు. ఇప్పుడు మళ్లీ రాజన్న రాజ్యం వచ్చిందంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్లన్నీ నిండుతున్నాయని ఫలితంగా రైతుల మోముల్లో ఒక భరోసా కనిపిస్తోందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.చివరగా ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos