ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.నెల్లూరు,ప్రకాశం జిల్లాలను కలుపుకొని మొత్తం 12 జిల్లలతో రాయలసీమను గ్రేటర్ రాయలసీమగా చేయడానికి జగన్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.నెల్లూరు,ప్రకాశం జిల్లాలను యథాతథంగానే ఉంచి రాయలసీమలోని నాలుగు జిల్లాలను విభజించడానికి జగన్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.ఎంపీ,ఎమ్మెల్యే నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను విభజించాలని అదికూడా ఏడాదిలోపు విభజన ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు భోగట్టా.కర్నూలు జిల్లాను మొత్తం మూడు జిల్లాలుగా.. అనంతపురం జిల్లాను రెండుగా.. చిత్తూరును మూడుగా.. కడప జిల్లాను రెండుగా విభజించాలని చూస్తున్నట్లు సమాచారం.అదే సమయంలో తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం ద్వారా తలెత్తిన సమస్యలపై కూడా అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్లో అటువంటి సమస్యలు ఎదురుకాకుండా వాటిని సమర్థవంతంగా అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం..