బాలీవుడ్ యువ హీరో సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకొని మరణించిన కొన్ని రోజుల్లోనే సుశాంత్ కూడా తన ఫ్లాట్ లో బలవన్మరణం పొందడం అనేక అనుమానాలను రేకెత్తించింది. అదే సమయంలో సుశాంత్ చనిపోవడానికి ఇండస్ట్రీలోని నెపోటిజం కారణమని.. తనకు అవకాశాలు రాకుండా చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు అనే వాదన కూడా వినిపించింది. సుశాంత్ ది ఆత్మహత్య అని పోస్ట్ మార్టం నివేదిక చెప్తున్నా.. ఆ తర్వాత దర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలు ఎన్నో సందేహాలకు తావిస్తోంది. అయితే సుశాంత్ సింగ్ బలవన్మరణం వెనక నిజానిజాలేమిటి? అన్నది ఇప్పటి వరకు విచారించిన పోలీసులు తేల్చలేదు. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడంతో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.కాగా సుశాంత్ మరణించడానికి కొన్ని రోజుల ముందు ముంబైలోని ఓ బ్యాంక్ లో తనకు సంబంధించిన ఖాతాను క్లోజ్ వేయవలసిందిగా కోరాడని నేషనల్ మీడియా ఛానల్స్ వెల్లడించాయి. దీంతో ఈ కేసులో మరో చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు సుశాంత్ ని హత్య చేసి ఉంటారనే కోణంలో ఆలోచిస్తున్నవారు.. ముందే అతను తన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలని అనుకున్నాడని తెలియడంతో.. సుశాంత్ సూసైడ్ చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించినా.. దాని వెనుక బలమైన కారణాలని.. దానికి కారణమైన వారిని గుర్తించవలసిన అవసరం ఉందని.. సీబీఐ విచారణలో ఈ కేసుకి సంబంధించిన అన్ని విషయాలు బయటకి వస్తాయని ధీమాతో ఉన్నారు..